NIFT | సృజనాత్మకత, నైపుణ్యతతో నిఫ్ట్ విద్యార్థులు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని నిఫ్ట్లో శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆక్రిలిక్ ఫెస్ట్ ( acrylic fest )లో విద్యార్థులు తాము వేసిన పలు రకాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి నిఫ్ట్ డైరెక్టర్ విజయ్కుమార్ విచ్చేసి పలువురు అధ్యాపకులతో కలిసి పాల్గొన్నారు. రెండు రోజులు కొనసాగిన పెయింటింగ్ ప్రదర్శనలో 10 మంది విద్యార్థుల బృందాలు పాల్గొన్నాయి. ఇందులో గెలుపొందిన మొదటి విజేతకు రూ.20వేలు, ద్వితీయ విజేతకు రూ.15వేలు, తృతీయ విజేతకు రూ.7,500 చొప్పున నిఫ్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందించారు.