మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట శివారులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం ముగిశాయి. మంగళవారం రాత్రి అమ్మవారికి గౌడ కులస్థులు బోనాలు సమర్పించారు. బుధవారం పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు 25 మంది గీత కార్మికులు ఒకే తాటి చెట్టుపైకి ఎక్కి కల్లు దింపారు . మోకు, ముస్తాదుకు తాకకుండా కల్లు కుండను దించి అమ్మవారికి సమర్పించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
– మంచిర్యాల అర్బన్