బెంగుళూరు: బెంగుళూరులో ప్రమాదకర జికా వైరస్(Zika Virus)ను గుర్తించారు. అక్కడ నమోదు అయిన అన్ని జ్వరం కేసుల్ని స్టడీ చేస్తున్నారు. చిక్కబల్లాపూర్ ప్రాంతంలోని దోమల్లో జికా వైరస్ ఉన్నట్లు పసికట్టారు. ఆగస్టులోనే ఆ శ్యాంపిళ్లను పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. శ్యాంపిల్ సేకరించిన తల్కాబెట్ట ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధి వరకు అలర్ట్ ప్రకటించారు. కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా సుమారు వంద శ్యాంపిళ్లను సేకరించారు. చిక్కబల్లాపూర్లో ఆరు ప్రదేశాల నుంచి శ్యాంపిళ్లను తీసుకున్నారు. దాంట్లో అయిదు నెగటివ్గా వచ్చాయి. ఒకటి మాత్రం పాజిటివ్గా తేలినట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ మహేశ్
బెంగుళూరులో తీవ్ర స్థాయి జ్వరంతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు చెందిన శ్యాంపిళ్లను విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డ్రైవ్లో భాగంగా శ్యాంపిళ్లను సేకరించారు. అయితే ఆ శ్యాంపిళ్లకు చెందిన ఫలితాలు అక్టోబర్ 25వ తేదీన రిలీజయ్యాయి. ఏడిస్ దోమ కాటుతో జికా వైరస్ వ్యాప్తి అవుతుంది. డెంగ్యూ, చికున్గున్యా లాంటి వ్యాధులు ఆ దోమతో వ్యాప్తి అవుతాయి. 1947లో ఉగాండాలో తొలిసారి జికా వైరస్ను గుర్తించారు.
గత ఏడాది డిసెంబర్లో కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో తొలిసారి ఓ అయిదేళ్ల అమ్మాయిలో జికా వైరస్ను గుర్తించిన విషయం తెలిసిందే.