బెంగళూరు : కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ.. ఓ వింత ప్రయత్నం చేశారు. చామరాజపేట నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి, ఈద్ మిలాన్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకకు దళిత పూజారి స్వామి నారాయణ్, ఎమ్మెల్యే జమీర్ ఖాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామి నారాయణ్కు ఎమ్మెల్యే తన చేతితో ఆహారం తినిపించారు. ఆ తర్వాత నారాయణ్ కూడా ఎమ్మెల్యేకు ఆహారం తినిపించబోయాడు. కానీ ఎమ్మెల్యే నిరాకరించారు. తినిపించడం కాదు.. మీరు నమిలిన ఆహారాన్ని తనకు తినిపించండని కోరాడు. నారాయణ్ సగం నమిలిన ఆహారాన్ని ఎమ్మెల్యే తిని అక్కడున్న వారందర్నీ షాక్కు గురి చేశారు. దీంతో ఆ కార్యక్రమానికి హాజరైన వారంతా ఎమ్మెల్యేను చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ಜಾತಿ, ಧರ್ಮಗಳೆಲ್ಲವನ್ನೂ ಮೀರಿದ್ದು ಮಾನವೀಯತೆ. ನಮ್ಮ ನಡುವಿನ ಮನುಷ್ಯ ಸಂಬಂಧಗಳಿಗೆ ಜಾತಿ, ಧರ್ಮಗಳು ಎಂದಿಗೂ ಅಡ್ಡಬರಬಾರದು.
ನಾನು, ನೀವು, ಎಲ್ಲರೂ ಮನುಷ್ಯ ಜಾತಿ.
ಮನುಷ್ಯನಾಗಿ ಬಾಳುವುದೇ ನಿಜವಾದ ಧರ್ಮ.#ಸಾಮರಸ್ಯ #ಮಾನವೀಯತೆ pic.twitter.com/3qVCvA6XuO— B Z Zameer Ahmed Khan (@BZZameerAhmedK) May 22, 2022