పాట్నా : పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించిన ఇద్దయు యువకుల పట్ల అనాగరిక చర్యకు పాల్పడ్డారు. అమానవీయంగా నేలపై ఉమ్మిని నాకించారు. ఈ ఘటన బీహార్ ఔరంగాబాద్ జిల్లాలోని సింఘనా గ్రామంలో వెలుగు చూసింది.
ప్రస్తుతం బీహార్లో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతన్నాయి. అయితే సింఘానా గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న బల్వంత్ సింగ్.. తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించాడు. ఓ ఇద్దరు యువకులు మాత్రం బల్వంత్ సింగ్కు ఓటు వేయమని చెప్పారు. ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో కోపంతో ఊగిపోయిన బల్వంత్ సింగ్.. ఆ ఇద్దరు యువకులకు కఠిన శిక్ష విధించాడు. నేలపై ఉన్న ఉమ్మిని నాకించారు. ఈ ఘటనపై జిల్లా కోర్టు, ఎస్పీ తీవ్రంగా స్పందించారు. బల్వంత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.