న్యూఢిల్లీ, జూన్ 6 : కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అక్కసు బయటపెట్టారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలిపింది.
దీనిపై రాంచీలో కొందరు మేధావులతో నితిన్ నబీన్ మాట్లాడుతూ.. కొందరు విదేశాల్లో ఉంటూ భారత యువతను నెగెటివ్ పాలిటిక్స్లోకి నెడుతున్నారని.. ఇది సరైంది కాదని చెప్పారు. భారత యువత తోలు బొమ్మల్లా కొందరు చెప్పినట్టు ఆడరని ఆయన అన్నారు. ప్రజలకు` వ్యతిరేకించే హక్కు ఉన్నదని.. అయితే అది ప్రజాస్వామ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నబిన్ చెప్పారు.