న్యూఢిల్లీ: టిబెట్ వంటకమైన మోమోలు ఇప్పుడు భారత్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్గా మారాయి. అయితే, వీటికి అలవాటు పడితే ఆరోగ్యం గుల్లేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్గా మోమోలు తినేవారికి డయాబెటిస్, ఫైల్స్, నాడీ రుగ్మత ముప్పు తప్పదని అంటున్నారు.
మోమోస్ తయారీకి వాడే మైదాపిండి వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోతాయని, ఇది డయాబెటిస్కు దారితీస్తుందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ పేర్కొంది. శరీరంలోని పోషకాలను ఇది హరిస్తుందని, గుండె సంబంధ వ్యాధులకు దారితీస్తుందని వివరించింది.