ముంబైలో ఎండలు మండిపోయాయి. రుతుపవనాలు ముందే రావడంతో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ముంబైవాసులు ఆనందపడుతున్నారు. కొంతమంది యువతీయువకులు ముంబై లోకల్ ట్రెయిన్లో ఆనందంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సెలబ్రిటీ డ్యాన్స్ ట్రైనర్ సంకేత్ పాంచల్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ను షేర్ చేశారు. ఏసీ లోకల్ ట్రెయిన్లో కొంతమంది అక్షయ్ కుమార్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా నటించిన ఐత్రాజ్ చిత్రంలోని ‘గిల గిల గిల దిల్ గిల గిలా’ పాటపై స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 9 లక్షలమంది వీక్షించారు. 74వేల లైక్స్ వచ్చాయి.