చెన్నై, సెప్టెంబర్ 23: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని నటుడు కమల్హాసన్ విమర్శించారు. అందరూ కలిసి చిన్న పిల్లాడిని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్న కరుణానిధి కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కరుణానిధి మనుమడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని తెలిపారు.