పూణె, డిసెంబర్ 25: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్పై ఆదివారం విమర్శలు గుప్పించారు. ‘కొందరు’ 38 ఏండ్ల వయసులో చేసినట్టు కాకుండా.. తాను 60 ఏండ్ల వయసులో ఒక నిర్ణయం తీసుకున్నానని అన్నారు. 1978లో శరద్ పవార్ 40 మంది ఎమ్మెల్యేలతో బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్ నేతృత్వంలోని వసంత్దాదా పాటిల్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యారని అజిత్ అన్నారు. పాటిల్ మంచి నాయకుడైనా ఆయనను పక్కన పెట్టి జనతాపార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి శరద్ పవార్ సీఎం అయ్యారని తెలిపారు. ఆయన 38 ఏండ్ల వయసులో చేసింది తాను 60 ఏండ్ల వయసులో చేశానని.. దీన్ని ఆయన అర్థం చేసుకోవాలని అన్నారు. అజిత్ వ్యాఖ్యలపై శరద్ పవార్ సోమవారం స్పందించారు. 1978లో జరిగింది తిరుగుబాటు కాదని, పరస్పర సంప్రదింపుల అనంతరం తీసుకున్న నిర్ణయమని చెప్పారు.