న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నూతన విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రస్తుత మూడేండ్ల డిగ్రీ కోర్సు రద్దు కాదని యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ తెలిపారు. మూడేండ్ల డిగ్రీ కొనసాగించాలా? నాలుగేండ్ల డిగ్రీని అందుబాటులోకి తేవాలా? అన్నది వర్సిటీల ఇష్టమని చెప్పారు. నాలుగేండ్ల డిగ్రీ చదివినవారు పీజీ చదవాల్సిన అవసరం లేకుండా పీహెచ్డీలో చేరే అవకాశం ఉంటుందన్నారు.