Yogi Adityanath in Delhi | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్.. దేశ రాజధానికి రావడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీతో భేటీకి ముందు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతోనూ భేటీ కానున్నారు.
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమిత్షా, జేపీ నడ్డాతో సహా పార్టీ అగ్రనాయకత్వంతో యోగి సంప్రదింపులకు ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రధాని మోదీతోపాటు అమిత్షా తదితరులతో సంప్రదింపులతో ప్రభుత్వ ఏర్పాటు, క్యాబినెట్ కూర్పులో సమీకరణాలు ఇత్యాధి అంశాలు చర్చిస్తారని భావిస్తున్నారు. దేశ రాజధానిలో రెండు రోజుల పాటు యోగి ఆదిత్యనాథ్ బస చేయొచ్చునని తెలుస్తున్నది. 403 స్థానాలు గల యూపీ అసెంబ్లీలో బీజేపీ 255, దాని రెండు మిత్ర పక్షాలు 18 సీట్లు గెలుచుకున్నాయి.