లక్నో : టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హెచ్చరించారు. టీ20 మ్యాచ్లో అక్టోబర్ 24న భారత్పై పాకిస్తాన్ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కశ్మీర్కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులను ఆగ్రాలో అరెస్ట్ చేసిన నేపధ్యంలో యోగి ఆదిత్యానాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముగ్గురు విద్యార్ధులపై స్ధానిక బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కాలేజ్ అధికారులు వారిని సస్సెండ్ చేశారు. విద్యార్ధుల చర్యకు నిరసనగా పలు హిందూ సంస్ధలకు చెందిన సభ్యులు క్యాంపస్లోకి వచ్చి ఆందోళన చేపట్టారని కాలేజ్ ఫ్యాకల్టీ సభ్యులు తెలిపారు. మరోవైపు పాక్ విజయం అనంతరం సంబరాలు జరుపుకున్న ఘటనలకు సంబంధించి ఆగ్రా, బరేలి, బదౌన్, సీతాపూర్ జిల్లాల్లో ఏడుగురిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత్పై పాకిస్తాన్ పది వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.