న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ( Yamuna River ) ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలతో పాటు హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో యమునాకు వరద పోటెత్తింది.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు 13 బోట్లను అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఉదయం 8:30 గంటలకు 205.22 మీటర్ల ఎత్తులో యమునా ప్రవహించింది. క్రమక్రమంగా యమునా నదిలో వరద ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు.