Taj Mahal | దేశంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) యమునా నది (Yamuna River) ఉప్పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఇప్పటికే నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా ఆగ్రా (Agra) లో నది నీటి మట్టం దాదాపు 500 అడుగులకు చేరుకుంది. దీంతో చారిత్రక కట్టడం తాజ్ మహల్ గోడలను (aj Mahal walls) యమునమ్మ తాకింది. వరద కారణంగా స్మారక చిహ్నం వెనుక ఉన్న ఉద్యానవనం పూర్తిగా నీట మునిగిపోయింది.
కాగా, తాజ్ మహల్ ను యమున వరద తాకడం 45 ఏళ్లలో ఇదే తొలిసారి. 1978లో వరదలు వచ్చిన సమయంలో తాజ్ ను యమున తాకింది. దాదాపు 508 అడుగుల ఎత్తులో యమునా నది ప్రవహించడంతో తాజ్మహల్ బేస్మెంట్లోని 22 గదుల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఆ తర్వాత ఆ స్థాయిలో కాకున్నా తాజ్మహల్ పరిసరాల్లోకి వరదనీరు రావడం ఇదే తొలిసారి. అయితే, తాజా వరద వల్ల తాజ్ మహల్ కు ఎలాంటి ముప్పూ లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. మరోవైపు ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా వరద నీరు చేరింది.
#WATCH | Uttar Pradesh: The water level of the Yamuna River continues to increase in Agra. pic.twitter.com/pRRFoUirUU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023
Also Read..
Viral News | ఆ గ్రామంలో రోజూ ఒకే టైమ్కి పవర్ కట్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Yamuna River | మళ్లీ డేంజర్ మార్క్ ను దాటిన యమునా నది ప్రవాహం
KCR Kaanuka Scheme | ‘కేసీఆర్ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు