న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ను డేటింగ్ ప్లాట్ఫామ్ గా తీర్చిదిద్దనున్నట్టు ఆ సంస్థ యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించా రు. ఉద్యోగ నియామకాల వేదికగానూ ఎక్స్ ను మార్చనున్నట్టు చెప్పారు. ఎక్స్ సీఈవో లిండా యకారినో, సంస్థ ఉద్యోగులతో తాజా గా నిర్వహించిన సమావేశంలో లింక్ట్ఇన్, యూట్యూబ్, ఫేస్టైమ్ వంటి యాప్లతో సహా డేటింగ్ యాప్లతో ఎక్స్ ఎలా పోటీ ప డాలనుకొంటున్నదో మస్క్ వివరించారు. ఎ క్స్పై తనకున్న విజన్, దాన్ని ‘ఎవ్రీతింగ్’ యా ప్గా ఎలా మార్చాలనే దానిపై చర్చించారు.