Shashi Tharoor | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వైఫల్యం ఘటన నుంచి ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టగా.. సభలో 143 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అధికార పార్టీపై విపక్ష కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీల సస్పెన్షన్పై కాంగ్రెస్ నేత శశి థరూర్ కేంద్రంపై మండిపడ్డారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సంతాప సందేశాలు రాయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
శశిథరూర్ పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ వరకు జరిగిన మార్చ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. సందేశం చాలా సులభమని.. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ను నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం సీనియర్గా తీసుకోని పరిస్థితి మనం చూస్తున్నామన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని గౌరవించేందుకు కేంద్రం సుముఖత చూపడం లేదనం విమర్శించారు. మంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా, సభకు హాజరుకావడానికి నిరాకరించడమే కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అమిత్ షా అవమానించారని మండిపడ్డారు.
సభలో కాకుండా బయట జర్నలిస్టులతో మాట్లాడరని.. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయంలోని రూల్ అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు ఆమోదయోగ్యం కాదని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని గౌరవించడానికి ఇష్టపడలేదన్నారు. భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని ఎంపీలు డిమాండ్ చేస్తే సస్పెండ్ చేశారని.. 97 మంది ఎంపీలు సభలో లేకుండానే లోక్సభలో మూడు క్రిమినల్ లా బిల్లలను ఆమోదించడం అవమానకరమన్నారు. ప్రతిపక్షాలతో సంప్రదింపులు, చర్చలు లేకుండానే ఈ చట్టాలను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం దేశానికి ఎంత నష్టం కలిగించిందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సంతాప సందేశం రాయడం ప్రారంభించాల్సిన తరుణం ఇదేనని ఆయన అన్నారు. సస్పెన్షన్కు గురైన సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ కేంద్రం ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించి భారతదేశం రాచరికం అని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని నిరసిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజలమైన మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని.. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ కీలకమైన బిల్లులను ఆమోదించడం ప్రజాస్వామ్యం కాదని మల్లికార్జున ఖర్గే అన్నారు.