కోల్కతా, జూలై 1: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారా? విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో హడావిడి చేసిన ఆమె.. బీజేపీ గిరిజన అభ్యర్థిని ప్రకటించాక ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారా? శుక్రవారం కోల్కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ ‘తమ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెడుతున్నట్టు బీజేపీ ముందుగా నాకు చెప్పి ఉంటే ఆమెకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలించేవాళ్లం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మద్దతు ఇచ్చే అంశాన్ని తాను ఒక్కదాన్నే తీసుకోలేనని అన్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలో నిలిపిన విషయం తెలిసిందే.