లక్నో, జూన్ 16 : అయోధ్య బాల రాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. జపాన్కు చెందిన మియాజాకీ ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు. వీటి ధర కిలో రూ.2.5 నుంచి రూ.3లక్షలు.
స్థానికంగా ఉండే ఓం ప్రకాశ్సింగ్ అనే రైతు రెండేండ్ల క్రితం ఈ మొక్కను జపాన్ నుంచి తెచ్చి నాటగా.. ఈ సీజన్లో పండ్లు చేతికి రావడంతో సోమవారం ఆ పండ్లను నైవేద్యంగా పెట్టారు.