న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: యువ భారత్ కనుమరుగవుతున్నది. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది.
రాబోయే దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ శతాబ్దం మధ్య నాటికి పిల్లల సంఖ్యను దాటి వృద్ధుల జనాభా భారీగా పెరిగే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్ఆర్ఏ) వెలువరించిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్లో వెల్లడైంది.