Shatrughan Sinha : తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీలో అంతర్గత విభేదాల చర్చ నడుస్తున్న వేళ ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీఎంసీ (TMC) తిరుగుబాటు వర్గంలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. టీఎంసీతోనే కొనసాగుతానని, మమతా బెనర్జీ (Mamata Banerjee) కే తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మమతాబెనర్జీ అండగా నిలిచారని, ఇప్పుడు ఆమెను కష్టాల్లో వదిలేసి వెళ్లేలేనని చెప్పారు.
మమతాబెనర్జీ ఇప్పటికీ ప్రజల్లో బలమైన ఆదరణ కలిగిన నాయకురాలని శత్రుఘ్న సిన్హా అన్నారు. ప్రజల మధ్య ఉంటూ పోరాడే నాయకురాలిగా ఆమె మరోసారి నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆమెకు భారీ ప్రజా మద్దతు ఉందని చెప్పారు. తాను ఆమె వెంటే ఉన్నానని, తృణమూల్ కాంగ్రెస్తో తన ప్రయాణం కొనసాగుతుందని సిన్హా స్పష్టంచేశారు. తనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. తనకు మేలు చేసిన మనిషికి తాను కీడు చేయలేనని ఆమె చెప్పింది.
ఇటీవల టీఎంసీలో కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన కూడా రెబెల్ గ్రూప్తో చేరనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు దీంతో కొంతవరకు చెక్ పడినట్టయింది.