న్యూఢిల్లీ: పాకిస్థాన్ వల్లే జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడులు జరుగుతున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లా(Farooq Abdullah) తెలిపారు. నిరంతర దాడులను ఆపేయాలని ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. స్నేహితులుగా కలిసి ఉండేందుకు పాకిస్థాన్ దారులు వెతుకాలని, లేదంటే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. కొన్ని రోజుల నుంచి కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. బారాముల్లాలో గురువారం రాత్రి ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. అంతకు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్ను కాల్చివేశారు. దాడులకు పరిష్కారం కనుగొనే వరకు ఇవి జరుగుతూనే ఉంటాయని, వీటికి మూలాలు తమకు తెలుసు అని, అమాయక ప్రజల్ని చంపే ఘటనలను 30 ఏళ్లుగా చూస్తున్నానని, ఎందుకు పాకిస్థాన్ ఈ దాడులకు పాల్పుడుతోందని, స్వంత భవిష్యత్తునే ఎందుకు నాశనం చేసుకుంటున్నారని, తామేమీ పాకిస్థాన్లో భాగం కాదు అని ఫారూక్ అబ్దుల్లా తెలిపారు.
Baramulla, J&K: JKNC President Farooq Abdullah reacts to the recent terror attack, says, “I have been witnessing this since 1984. This terrorism has not stopped. Many of our colleagues were martyred, but it still continues every year. This means it has not stopped, and you know… pic.twitter.com/isPorL3eCf
— IANS (@ians_india) October 25, 2024