తిరువనంతపురం : ప్రముఖ విద్యావేత్త, మహిళా హక్కుల కార్యకర్త మేరీ రాయ్ (89) కేరళలోని కొట్టాయంలో గురువారం తుది శ్వాస విడిచారు. మేరీ రాయ్ బుకర్ ప్రైజ్ విజేత, రచయిత అరుంధతీ రాయ్ తల్లి. కేరళలోని సిరియన్ క్రిస్టియన్లు ఆచరించే లింగ వివక్షతో కూడిన వారసత్వ చట్టానికి వ్యతిరేకంగా 1986లో ఆమె సుప్రీంకోర్టు దావాలో విజయం సాధించారు.
అప్పట్లో ఈ కేసును మేరీ రాయ్ కేసుగా వ్యవహరించారు. కేరళలోని సిరియన్ క్రిస్టియన్ల కుటుంబ ఆస్తుల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. కొట్టాయంలో ప్రముఖ స్కూల్ పల్లికూదం వ్యవస్ధాపకురాలిగా కూడా మేరీ రాయ్ వ్యవహరించారు.