ముంబై : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఈ ఫలితాలపై తాను వ్యాఖ్యానించబోను అని పాటిల్ పేర్కొన్నారు. కానీ ఈ ఫలితాలు చూస్తుంటే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందన్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో మహిళలంతా యోగి ఆదిత్యనాథ్కు, పురుషులంతా అఖిలేష్ యాదవ్కు ఓటేసి ఉండొచ్చు అని పాటిల్ పేర్కొన్నారు. బీజేపీని ఢీకొట్టడం ఇతర పార్టీలకు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.