Indore | ఇండోర్, జనవరి 30: భార్య వేధింపులు తాళలేక ఒక యువ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, మహిళలు దానిని దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని తన సూసైడ్ నోట్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులు అతని భార్య, తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫొటోగ్రాఫర్గా పనిచేసే నితన్ పడియార్(28)పై అతని భార్య రాజస్థాన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో 20న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి తప్పుడు కేసుల ద్వారా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, యువకులు పెండ్లి చేసుకోవద్దని సూసైడ్ నోట్లో కోరాడు.