బెంగళూరు: ఇద్దరు మహిళా ప్రయాణికులు బస్సులో రచ్చ చేశారు. ఒకరినొకరు బూట్లతో కొట్టుకున్నారు. (Women hit each other with shoes in bus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ నేపథ్యంలో బస్సుల్లో రద్దీ పెరుగడంతో సీట్ల కోసం, ఇతర విషయాలపై మహిళలు కొట్టుకుంటున్నారు.
కాగా, ఈ నెల 8న బెంగళూరులో రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ జరిగింది. బస్సు కిటికీ అద్దం జరుపడంపై వాగ్వాదం మొదలైంది. ఇది ముదరడంతో ఆ మహిళలు ఒకరినొకరు బూట్లతో కొట్టుకున్నారు. బస్సులోని మిగతా ప్రయాణికులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. చివరకు కండక్టర్ ఆ ఇద్దరు మహిళలను బస్సు నుంచి దించివేశాడు.
మరోవైపు ఆ బస్సులో ప్రయాణించిన కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో మహిళల కోట్లాటను రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇటీవల బస్సులు, రైళ్లలో మహిళలు ఘర్షణకు దిగి కొట్టుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయని పలువురు పేర్కొన్నారు.
Slipper-Kalesh b/w Two women Inside BMTC bus over Sliding the Glass , Bengaluru
pic.twitter.com/sBQA9oqOly— Ghar Ke Kalesh (@gharkekalesh) February 8, 2024