న్యూఢిల్లీ : గ్వాటెమాలలోని అగ్నిపర్వతంపైకి ప్రయాణించిన మహిళ ఏకంగా వాల్కనోపై వండిన పిజ్జాను తింటున్న వీడియో (Viral Video) నెట్టింట వైరల్గా మారింది. అగ్నిపర్వతంపై ప్రత్యేక పిజ్జా ట్రై చేసిన మహిళ పలువురు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అలెగ్జాండ్ర బ్లాడ్గెట్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ క్లిప్ గ్వాటెమాలలో ఆమె టూర్ గ్లింప్స్ను వెల్లడించింది.
View this post on Instagram
A post shared by Bucket List + Adventure Travel ✺ Alex (@alexandrablodgett)
అగ్నిపర్వతంపై వండిన ప్రత్యేక పిజ్జా టైప్ను మహిళ ప్రయత్నించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. లావా రాక్స్ నడుమ పిజ్జాను వండిన తీరు ఈ వీడియో కండ్లకు కట్టింది. అగ్నిపర్వతంపై వండిన పిజ్జాను తినేందుకు గ్వాటెమాలకు ప్రయాణం..మేం కేవలం దానికోసమే అక్కడికి వెళ్లలేదు..ఈ ట్రిప్లో ఎంతో సరదాగా గడిపాం..ఈ అగ్నిపర్వతం చాలా యాక్టివ్! అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 12 లక్షల మందిపైగా వీక్షించారు. ఈ వినూత్న డిష్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పిజ్జా టేస్ట్ ఎలా ఉందని తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.
Read More :
Karachi | ప్రపంచంలోనే అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా కరాచీ