బిజ్నూర్ (యూపీ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయి. ఓ వ్యాపారస్తుడు లక్ష్యంగా రెండుసార్లు దొంగతనం జరిగింది. తొలిసారి దొంగతనం జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునుంటే రెండోసారి దొంగతనం జరిగి ఉండేది కాదు. ఆ వ్యాపారి భార్య లైంగికదాడికి గురయ్యేదికాదు. ఈ దారుణ ఘటన బిజ్నూర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గత నెల 19న తొలిసారి దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. మళ్లీ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఆయన భార్యను కట్టేసి లైంగికదాడికి పాల్పడ్డారు. సిగిరెట్లతో కాల్చారు. బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు.