లక్నో: ఒక మహిళ కూరగాయల బండ్లను కాలితో తన్నింది. ఆ తర్వాత క్రికెట్ బ్యాట్తో ధ్వంసం చేసింది. (Woman Vandalises Vendors Carts with Bat) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. కూరగాయలు, ఉల్లిపాయల తోపుడు బండ్లను వ్యాపారులు తన షాపు ఎదుట ఉంచడంపై ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని కాలితో తన్నింది. ఆ తర్వాత చేతిలోని బ్యాటుతో అక్కడి తోపుడు బండిపై బాదింది. కూరగాయలు, ఉల్లిపాయలను కింద పడేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒక మహిళతో ఘర్షణకు దిగింది.
కాగా, స్థానికులు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. దర్యాప్తు చేసిన పోలీసులు క్రికెట్ బ్యాట్తో తోపుడు బండ్లపై ప్రతాపం చూపిన ఆ మహిళను పూనమ్ చౌదరిగా గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
UP : गाजियाबाद में पूनम चौधरी नामक महिला ने अपनी दुकान के बाहर खड़े ठेलों से सब्जी फेंक दी। कुछ महिलाएं उसे रोकने आईं तो उनसे भी बदतमीजी की। पूनम पर FIR हो गई है। pic.twitter.com/6UA61APkyh
— Sachin Gupta (@SachinGuptaUP) February 7, 2024