జడతో డబుల్ డెక్కర్ బస్సును లాగడం అంటే అది నిజంగా పెద్ద సాహసం అనే చెప్పాలి. సాహసం కన్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ.. భారత్కు చెందిన ఆశా రాణి అనే మహిళ తన జడతో డబుల్ డెక్ బస్సును లాగింది. దాని బరువు ఎంతో తెలుసా అక్షరాలా 12,126 కేజీలు. ఇది అన్ని వాహనాల్లోనే అత్యంత బరువు ఉన్న వాహనం. దీన్ని తన జడతో లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది ఆశా రాణి.
2016లోనే ఆశా రాణి ఇటలీలో ఈ ఫీట్ను సాధించింది. తనకు ఐరన్ క్వీన్ అనే బిరుదును కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఇచ్చారు. అలాగే.. గిన్నిస్ బుక్లో తన పేరును నమోదు చేశారు. తాజాగా అప్పటి వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్స్టా పేజీలో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.