లక్నో: టీజ్ చేసిన ఒక వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టింది. ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యంది. ఝాన్సీలోని గుర్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హేవత్పురాలో ఒక వ్యక్తి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె అతడికి దేహశుద్ధి చేసింది. ధైర్యంగా అతడ్ని ఎదుర్కొంది. అంతా చూస్తుండగా ఆ వ్యక్తిని చెప్పుతో పలుమార్లు కొట్టింది. స్థానికుడైన ఒక వ్యక్తి కూడా అతడిపై చేయి చేసుకున్నాడు.
మరోవైపు స్థానికుల్లో కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఈ సంఘటనను రికార్డు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు ఆ మహిళ చర్యను సమర్థించారు. ఈవ్ టీజర్కు సరైన గుణపాఠం చెప్పిందంటూ ప్రశంసించారు. కాగా, ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై దర్యాప్తు చేస్తామని ఝాన్సీ ఎస్పీ దేహత్ నేపాల్ సింగ్ తెలిపారు.