Viral Video | రాకాసి అలలు ఓ మహిళను బలి తీసుకున్నాయి. అలల ధాటికి తమ కళ్ల ముందే కొట్టుకుపోయిన తల్లిని చూసి.. మమ్మీ.. మమ్మీ అంటూ పిల్లల అరిచారు. ఈ ఘటన ముంబైలోని బాంద్రా ఫోర్టులో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని రబలేకు చెందిన ముకేశ్, జ్యోతి సోనార్ దంపతులు కలిసి తమ పిల్లలతో గత ఆదివారం జుహు చౌపట్టికి వెళ్లారు. అక్కడ అలల ఉధృతి అధికంగా ఉండటంతో బీచ్లోకి అధికారులు అనుమతించలేదు. దీంతో వారు బాంద్రా ఫోర్టుకు చేరుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరూ సరదాగా అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాళ్లపై కూర్చున్న దంపతులను రాకాసి అలలు సముద్రంలోకి లాగేసుకున్నాయి. భార్యను కాపాడేందుకు ఆమె చీర పట్టుకుని లాగాడు ముకేశ్. కానీ ఆమె అలల ధాటికి కొట్టుకుపోయింది. ముకేశ్ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపులు చేపట్టగా, ఆమె మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది.
అయితే తల్లి జ్యోతి అలల ధాటికి కొట్టుకుపోతున్న సమయంలో వారికి సమీపంలో ఉన్న పిల్లలు మమ్మీ మమ్మీ అంటూ అరిచారు. తమ కళ్ల ముందే తల్లి సముద్రంలోకి కొట్టుకుపోవడాన్ని చూసి ఆ పిల్లలు తల్లడిల్లిపోయారు. ముకేశ్, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
This is so horrible How can a person risk their life for some videos..
The lady has swept away and lost her life in front of his kid.#bandstand #Mumbai pic.twitter.com/xMat7BGo34— Pramod Jain (@log_kyasochenge) July 15, 2023