బెంగళూరు: ప్రియుడైన సహోద్యోగి మొబైల్ ఫోన్లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. (Woman Shocked) అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యింది. పని చేసే సంస్థకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల యువతి ఒక బీపీవో సంస్థలో పని చేస్తున్నది. సహోద్యోగి అయిన 23 ఏళ్ల ఆదిత్య సంతోష్, ఆమెకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు అతడి మొబైల్ ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు.
కాగా, ఒక రోజు ఆఫీస్లో ఉండగా ఆ యువతి ఆదిత్య మొబైల్ ఫోన్ తీసుకుంది. గ్యాలరీ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోలు చూసింది. సుమారు 13,000కుపైగా అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటం చూసి ఆమె షాక్ అయ్యింది. వాటిలో తనతోపాటు అక్కడ పని చేసే ఇతర మహిళల నగ్న ఫొటోలు ఉండటంతో ఆందోళన చెందింది. పనిచేసే బీపీవో సంస్థకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆ సంస్థకు చెందిన లీగల్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.