ముంబై : ఓ మహిళా సర్పంచ్ను అత్యంత ఘోరంగా చంపేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని నగ్నంగా రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. మహద్ తాలుకా బెలోషి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న గోనె సంచిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గోనె సంచిని విప్పి చూడగా.. అందులో మహిళ మృతదేహం నగ్నంగా కనిపించింది. ఆమె శరీరంపై అనేక గాయాలున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
మృతురాలిని స్థానిక సర్పంచ్గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.