అహ్మదాబాద్: ప్రిన్సిపాల్తో బలవంతంగా విద్యార్థినికి దండం పెట్టించడంతోపాటు ఆమె కాళ్లు కూడా ఏబీవీపీ తాకించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థిని హాజరు తక్కువగా ఉంది. దీంతో గురువారం ఏబీవీపీ నేత అక్షత్ జైస్వాల్, ఆ విద్యార్థినితోపాటు మరి కొందరిని వెంటపెట్టుకుని మహిళా ప్రిన్సిపాల్ మోనికా స్వామి చాంబర్కు వెళ్లాడు. విద్యార్థిని హాజరు తక్కువగా ఉండటంపై ప్రిన్సిపాల్, ఆ కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ విద్యార్థిని కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక ఘర్షణను నివారించేందుకు మహిళా ప్రిన్సిపాల్ మోనికా, ఆ విద్యార్థినికి రెండు చేతులతో మొక్కింది. అనంతరం తన కూర్చి నుంచి లేచి ఆమె కాళ్లు పట్టుకున్నది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఏబీవీపీ తీరుపై కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ మండిపడింది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం చర్య సిగ్గు చేటని విమర్శించింది. విద్యా సంస్థల్లో ఏబీవీపీ గూండాయిజానికి ఈ వీడియో నిదర్శనమని ఆరోపించింది.
మరోవైపు ఈ ఘటనపై ఏబీవీపీ కూడా స్పందించింది. అక్షత్ జైస్వాల్ చర్యపై శుక్రవారం క్షమాపణలు చెప్పింది. ఉపాధ్యాయ, విద్యార్థి మధ్య సంబంధాన్ని పవిత్రంగా తమ సంస్థ భావిస్తుందని పేర్కొంది. ఈ విషయంలో తప్పు చేసిన అక్షత్ జైస్వాల్ను ఏబీవీపీ నుంచి తొలగించినట్లు వెల్లడించింది. అలాగే ఏబీవీపీ సీనియర్ నేతలు ఆ మహిళా ప్రిన్సిపాల్ను స్వయంగా కలిసి జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు.
ગુરૂ ની ગરિમા ને તાર- તાર કરનાર @ABVPGujarat નાં નેતાઓ સામે @jitu_vaghani શિક્ષણ વિભાગ ખુદ ફરિયાદી બને – @NSUIGujarat @Neerajkundan@jagdishthakormp @Pawankhera @rssurjewala @drmanishdoshi@IG_Gohil_ @SatveerINC @Mahipalsinh_INC#SameOnABVP#एबीवीपी_के_गुंडे pic.twitter.com/IBXsYc87H8
— Bhavik Solanki (@bhaviksolankee) May 13, 2022