న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ఓ మహిళ జాతీయ జెండా ఎదుట హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మువ్వన్నెల జెండాకు మహిళ హారతి ఇస్తున్న ఎనిమిది సెకండ్ల వ్యవధి కలిగిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనిష్ శరణ్ చేయగా ఇప్పటివరకూ 2.4 లక్షల మందికి పైగా వీక్షించారు.
తన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాకు హారతి ఇస్తున్న మహిళ ఈ వీడియోలో కనిపించారు. హర్ఘర్ తిరంగ హ్యాష్ట్యాగ్తో షేర్ చేసిన ఈ పోస్ట్కు అవనీష్ శరణ్ రెస్సెక్ట్ అని క్యాప్షన్ ఇచ్చారు. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా ఆగస్ట్ 13 నుంచి 15 వరకూ దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ఇండ్లపైన జాతీయ జెండాను ప్రజలు ఎగురవేశారు.
Respect.❤️#HARGHARTIRANGA pic.twitter.com/GFDjxpS0CZ
— Awanish Sharan (@AwanishSharan) August 14, 2022
ఇక త్రివర్ణ పతాకానికి మహిళ హారతి ఇస్తున్న వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఇక ఇంటర్నెట్లో స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర ఓ వృద్ధ దంపతులు జాతీయ జెండాను ఎగురవేసిన ఫోటోను షేర్ చేశారు.