ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ డాక్టర్లు ఓ మహిళ కడుపు నుంచి 15 కిలోల కణితి(Tumour)ని సర్జరీ చేసి తీశారు. కడుపు నొప్పితో ఆ మహిళ ఇండెక్స్ ఆస్పత్రిలో చేరింది. 41 ఏళ్ల ఆ మహిళ కడుపులో ఉన్న కణతిని తీసేందుకు రెండు గంటల కన్నా ఎక్కువ సమయం సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. దాదాపు డజన్ మంది డాక్టర్లు ఆ బృందంలో ఉన్నారు. డాక్టర్ అతుల్ వ్యాస్ నేతృత్వంలో సర్జరీ జరిగింది. నడుస్తున్నప్పుడు, తింటున్న సమయంలో కణతి వల్ల పేషెంట్కు ఇబ్బందులు తలెత్తినట్లు తేలింది. ఆ మహిళ సుమారు 49 కేజీల బరువు ఉంది. కానీ ఆమె కడుపులో ఉన్న కణితి 15 కేజీల ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఆ కణతి వల్ల కడుపులో వాపు వచ్చిందని, అయితే అది పగలలేదని, లేదంటే ఆమె ప్రాణాలకు ముప్పు ఉండేదన్నారు. కడుపులో కణతిని ఓవేరియన్ ట్యూమర్గా ఇండెక్స్ డాక్టర్లు గుర్తించారు.