ముంబై : మహారాష్ట్ర స్వరాజ్ ఎక్స్ప్రెస్లోని రైలు వాష్రూమ్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాంద్రా రైలు టెర్మినస్ నుంచి జమ్ముతావికి ఆదివారం బయలుదేరగా.. 20 సంవత్సరాల యువతి ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత రైలు ప్రయాణం మొదలైంది. కొద్ది సేపటి తర్వాత యువతి వాష్ రూమ్కు వెళ్లింది. చాలా సమయం గడిచినా యువతి సీట్లోకి రాలేదు.
ఆ తర్వాత వాష్ రూమ్ తలుపులు పగులగొట్టిచూడగా.. మృతదేహం కనిపించిందని పలువురు ప్రయాణికులు అధికారులు సమాచారం ఇచ్చారు. యువతి వాష్ రూమ్కి వెళ్లి చాలా సేపటి వరకు సీట్లోకి రాలేదని, ఎస్4 కోచ్లోని తోటి ప్రయాణికులు తెలిపారు. వాష్ రూమ్ వద్ద యువతిని పిలిచినా ఎలాంటి స్పందన లేదని, ఆ తర్వాత టీసీ పలువురు ప్రయాణికులతో కలిసి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. లోపలి నుంచి గడియవేసి ఉండడంతో తెరువలేకపోయారు. ఆ తర్వాత రైలును దహను రోడ్ రైల్వేస్టేషన్ నిలిపివేశారు.
సిబ్బందికి అక్కడికి చేరుకొని.. డోర్ను తెరువగా.. యువతి మెడకు గుడ్డ కట్టి నేలపై కదలకుండా పడి ఉంది. అయితే, ఆత్మహత్య కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాల ప్రకారం బిహార్కు చెందిన ఆర్తిగా గుర్తించారు. మృతదేహాన్ని దహనులోని కాటేజ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టంతో మరణానికి కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.