బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ మహిళ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. సదరు మహిళ వలపు వల పేరుతో పలువురు పురుషులను లొంగదీసుకొని వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయి తే ఇలా మోసపోయినవాళ్లంతా కలిసి ఆమె ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. అనంతరం మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.