లక్నో: ఒక మహిళ ఆన్లైన్లో రిస్ట్ వాచ్ ఆర్డర్ చేసింది. అయితే అందుకున్న పార్సిల్లో పిడకలు ఉండటం చూసి ఆమె షాక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దసరా పండుగ నేపథ్యంలో ఆన్లైన్ సేల్స్ వెల్లువెత్తాయి. ఈ కామర్స్ వెబ్సైట్లు డిస్కాంట్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడ్డాయి. నీలం యాదవ్ అనే మహిళ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ల సందర్భంగా రూ.1,304 విలువ చేసే రిస్ట్ వాచ్ ఆర్డర్ చేసింది. వస్తువు అందిన తర్వాత డబ్బులు చెల్లించే విధానాన్ని ఆమె ఎంచుకుంది.
కాగా, నీలం యాదవ్కు సెప్టెంబర్ 28న ఒక పార్సిల్ వచ్చింది. డెలివరీ వ్యక్తి అందజేసిన ప్యాక్ను తెరిచిన ఆమె షాక్ అయ్యింది. ఆర్డర్ చేసిన రిస్ట్ వాచ్కు బదులుగా అందులో ఆవు పేడతో చేసిన నాలుగు చిన్న పిడకలు ఉన్నాయి. దీంతో నీలం సోదరుడు ఆ డెలివరీ వ్యక్తి వెంటపడ్డాడు. కొంత వాదన తర్వాత వారు చెల్లించిన డబ్బులను అతడు తిరిగి ఇచ్చాడు. పొరపాటున డెలివరీ అయిన పిడకల పార్సిల్ను వెనక్కి తీసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.