కూతురి కోసం ఒంటరి మహిళ సాహసం
తూత్తుకుడి, మే 14: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింపులు ఎదురయ్యాయి.
దీంతో ఒంటరి మహిళగా ఉన్న తాను ఈ వేధింపుల నుంచి తప్పించుకోవడంతో పాటు బిడ్డను అన్ని సౌకర్యాలతో పెంచుకునేందుకు జుట్టు కత్తిరించి, లుంగీ కట్టి 30 ఏండ్ల పాటు పూర్తిగా మగ వ్యక్తి వేషంలోకి మారిపోయింది. ‘ముత్తు’గా మారి మూడు దశాబ్దాలుగా పెయింటర్, వంట మాస్టర్ వంటి పనులు చేసింది. కూతురికి పెండ్లి చేసి అత్తారింటికి పంపింది.