ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్యే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసింది. అనంతరం మృతదేహాన్ని కిచెన్లో పాతిపెట్టింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసార్ చౌల్ ఏరియాలో 11 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దహిసార్ చౌల్ ఏరియాకు చెందిన రయీస్ షేక్, షాహిదా షేక్ ఇద్దరూ భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు.
అయితే, షాహిదా షేక్కు అమిత్ విశ్వకర్మ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. విషయం భర్త రయీస్ దృష్టికి వెల్లడంతో భార్యను మందలించాడు. అమిత్ విశ్వకర్మను బెదిరించాడు. దాంతో తమ బంధానికి అడ్డు తగులుతున్నాడని ఇద్దరూ రయీస్పై కక్ష పెంచుకున్నారు. 10 రోజుల క్రితం రాత్రిపూట రయాస్ నిద్రలో ఉన్న సమయం చూసి ఇద్దరూ కలిసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే టైల్స్ తొలగించి పాతిపెట్టారు.
అనంతరం రయీస్ కుటుంబసభ్యుల ఒత్తిడితో షాహిదా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాహిదా ఇంట్లో తనిఖీ చేశారు. వంటింట్లో టైల్స్ తొలగించి మళ్లీ వేసినట్లు గుర్తించి షాహిదాను అనుమానించారు. ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. దాంతో షాహిదాను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న అమిత్ విశ్వకర్మ కోసం గాలిస్తున్నారు.