గ్వాలియర్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) పట్టపగలే అపహరణకు (Kidnap) గురైన యువతి ఆచూకీ లభించింది. సోమవారం ఉదయం గ్వాలియర్లోని ఓ పెట్రోల్ పంప్ వద్ద వేచి ఉన్న 19 ఏండ్ల యువతిని బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు గుణాలోని ఓ లాడ్జిలో (Guna Lodge) ఆమెను కనుగొన్నారు. అనుమానితుల్లో ఒకరిని అరెస్టు చేశారు.
సోమవారం ఉదయం ఓ యువతి తన బంధువులతో కలిసి గ్వాలియర్లోని నాకా చంద్రవద్ని పెట్రోల్ స్టేషన్ వద్ద బస్సు దిగారు. ఈ సమయంలో బైక్పై ఒక వ్యక్తి సిద్ధంగా ఉండగా.. మరో వ్యక్తి ఆ యువతిని ఈడ్చుకెళ్లి బైక్పై కూర్చోబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తున్నా ఎవరూ కాపాడలేకపోయారు. వెంటనే ఆమె బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో గుణాలోని లాడ్జ్లో ఆమె ఆచూకీ లభించినట్లు గ్వాలియర్ ఎస్పీ రాజేశ్ సింగ్ ఛందాల్ (Rajesh Singh Chandel) చెప్పారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామన్నారు. మరొకరి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
#UPDATE | Madhya Pradesh: The 19-year-old girl who was abducted near Naka Chandravadni petrol station in Gwalior yesterday has been found at a lodge in Guna. She was abducted by two motorbike-borne men. One of the men has been nabbed from Lahar: SP Gwalior Rajesh Singh Chandel https://t.co/p0KNRQTpd4
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 21, 2023