Woman Dies | లక్నో : కొత్తగా పెళ్లైంది. ఇక తొలిరాత్రిలోనే తనివితీరా అనుభూతి పొందాలనుకున్నాడు. అందుకు శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ వినియోగించాడు. ఆ తర్వాత భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే ఆ చర్యలో భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూతన వధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హమీర్పూర్ పరిధిలోని ఉరైకు చెందిన ఓ ఇంజినీర్ ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇక 4వ తేదీన పుట్టింటి నుంచి అత్తారింటికి నూతన వధువు వెళ్లింది. ఫిబ్రవరి 7వ తేదీన వరుడి ఇంట్లో నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. అయితే తొలిరాత్రిలోనే ఎక్కువ అనుభూతి పొందాలనుకున్న వరుడు.. శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకున్నాడు.
అనంతరం భార్యతో శృంగారం చేశాడు. అయితే వధువుకు తీవ్ర రక్తస్రావం జరిగింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రయివేటు నర్సింగ్హోంకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 10వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.