భోపాల్: పిల్లల్ని కనేందుకు (to have a kid) భర్తను విడుదల చేయాలని జైలు అధికారులను ఒక మహిళ కోరింది. ఆమె విన్నతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపుతామని జైలు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శివపురికి చెందిన దారా సింగ్ జాతవ్కు పైళ్లైన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హత్య కేసులో దోషిగా తేలిన అతడు గ్వాలియర్ సెంట్రల్ జైలులో ఏడేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు.
కాగా, దారా సింగ్ తల్లిదండ్రులు వృద్ధులు. కుమారుడి పెళ్లి వేడుకలు పూర్తి కాకముందే పోలీసులు అరెస్ట్ చేశారని తండ్రి కరీం సింగ్ జాతవ్ వాపోయాడు. తన భార్య అనారోగ్యంతో ఉన్నదని, తాము చనిపోయేలోపు మనవడ్ని చూడాలని ఉందని పేర్కొన్నాడు. దీని కోసం కుమారుడ్ని కొన్ని రోజులు జైలు నుంచి విడుదల చేయాలని ప్రాథేయపడ్డాడు. ఈ నేపథ్యంలో దారా సింగ్ పెరోల్ కోసం కోడలితో కలిసి గ్వాలియర్ సెంట్రల్ జైలును ఆశ్రయించాడు. సంతానం కోసం తన భర్తను విడుదల చేయాలని జైలు అధికారులను ఆమె కోరింది.
మరోవైపు ఖైదీ దారా సింగ్ పెరోల్కు సంబంధించిన వినతిని శివపురి ఎస్పీ పరిశీలనకు పంపినట్లు గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిరవయ్య తెలిపారు. ఇతర ఖైదీలు, జైలు అధికారులతో ప్రవర్తన మంచిగా ఉండి, రెండేళ్లు జైలు శిక్ష పూర్తైన ఖైదీలు పెరోల్కు అర్హులని చెప్పారు. అయితే ఒక ఖైదీకి పెరోల్ మంజూరు చేయాలా, వద్దా అనేది జిల్లా కలెక్టర్దే తుది నిర్ణయమని అన్నారు.