చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకేపై పెత్తనం కోసం మాజీ సీఎంలు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) మధ్య పోరు కొనసాగుతున్నది. ఓపీఎస్కు అనుకూలంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను గతవారం మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఎడప్పాడి పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్ని, ఓపీఎస్ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో ఈపీఎస్ పార్టీ బాస్ హోదాలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి గురువారం వెళ్లారు. అనుచరులు, మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద ఉన్న మాజీ సీఎంలు ఎంజీఆర్, జయలలిత విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం ఎడప్పాడి పళనిస్వామి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓపీఎస్ పార్టీ కార్యాలయంలో హింసను రాజేశారని ఆయన మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని పార్టీ కార్యాలయంలోకి శ్రేణులు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. ఓపీఎస్ ఊసరవల్లి లాంటి వ్యక్తి అని, పార్టీకి ఆయన ద్రోహం చేశారని ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు త్వరలో జరుగుతాయని అన్నారు. మరోవైపు మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఓపీఎస్ సవాల్ చేశారు.
#WATCH | Tamil Nadu: AIADMK interim general secretary Edappadi K Palaniswami arrives at party HQ in Chennai, amid celebrations and a huge gathering of supporters, for the first time since the party's General Council Meeting. pic.twitter.com/ub9mUcR0hu
— ANI (@ANI) September 8, 2022