న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) చట్టం-2013 సవరణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 సవరణ బిల్లు ఈ సమావేశాల్లో టేబుల్పైకి రానున్నాయి.
అదేవిధంగా బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం-1970, బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం-1980కి కూడా సవరణలు చేయనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ బిల్-2021కి కేంద్ర సర్కారు గత వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదముద్ర వేయించుకున్నది. కాగా, శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల కావడంతో ఇక అధికార, ప్రతిపక్షాలు పార్లమెంట్లో అనుసరించాల్సి వ్యూహాలను సిద్ధం చేసుకోనున్నాయి.