మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించడానికి రెడీ అయింది. రెండు ఫైల్స్ను క్లియర్ చేస్తే.. తనకు 300 కోట్ల రూపాయలను లంచం ఇవ్వడానికి రెడీ అయ్యారని సత్యపాల్ మాలిక్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫైల్స్లో ఒక ఫైల్ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించినది కాగా… మరో ఫైల్ ఆరెస్సెస్ నేతకు సంబంధించినది అని ఆయన వెల్లడించారు.
సత్యపాల్ మాలిక్ జమ్మూ కశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో ఆరోపణలు చేశారు. ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించానిని ఆయన అప్పట్లో ప్రకటించారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ విషయంపై విచారణ జరపాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సీబీఐకి సిఫార్సు చేసింది. ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని, నిష్పక్షపాతంగా ఉండాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సీబీఐని కోరింది.
రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ గవర్నర్ హోదాలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జమ్మూ కశ్మీర్లో ఉన్నప్పుడు నా దగ్గరికి రెండు ఫైల్స్ వచ్చాయి. ఒకటి అంబానీ ఫైల్. మరోకటి ఆరెస్సెస్ నేత, బీజేపీ, మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి సంబంధించిన ఫైల్ ఒకటి. ఆయన మోదీకి కూడా బాగా దగ్గర. అవినీతి ఆరోపణలు వీటి చుట్టూ వున్నాయని నా వ్యక్తిగత కార్యదర్శులు చెప్పారు. ఒక వేళ వీటిని క్లియర్ చేస్తే 300 కోట్ల లంచం ఇస్తారని కూడా చెప్పారు. దీంతో నేను ఆ ఫైల్స్ను కేన్సిల్ చేసేశాను. నేను కేవలం 5 బట్టల జతలతోనే వచ్చాను. అలాగే వెళ్లిపోతాను అని నా కార్యదర్శులతో చెప్పాను అంటూ గవర్నర్ సత్యపాలిక్ వ్యాఖ్యానించారు.