ప్రచారం: సోమవారం నిర్వహించిన సీబీఎస్ఈ పన్నెండో తరగతి అకౌంటెన్సీ టెర్మ్-1 పరీక్షకు ఆరు వరకు గ్రేస్ మార్కులు కలుపనున్నారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. 31 ప్రశ్నల్లో విద్యార్థులు 28 ప్రశ్నలకు సరిగ్గా జవాబులు రాస్తే చాలు.. 38 మార్కులు సాధించవచ్చు.
వాస్తవం:సోషల్మీడియాలో ప్రచారమవుతున్న ఆడియో క్లిప్ అవాస్తవమని సీబీఎస్ఈ మంగళవారం స్పష్టం చేసింది. ఆ ఆడియో సందేశం నకిలీదని తేల్చి చెప్పింది. గ్రేస్ మార్కుల కేటాయింపు నిర్ణయం అబద్ధమని, దానిపై బోర్డు ఏ నిర్ణయం తీసుకోలేదన్నది.