రాయ్పూర్: 2026 మార్చినాటికి నక్సల్ హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో యాంటీ నక్సల్ ఆపరేషన్స్పై జరిగిన సమావేశం అనంతరం శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వామపక్ష తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం వచ్చిందని చెప్పారు. మన దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థకు అతి పెద్ద సవాల్ నక్సలిజమని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సవాల్ను స్వీకరించిందని, ఆయుధాలు పట్టినవారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తేవడానికి ప్రయత్నించిందని చెప్పారు. నక్సలిజం వల్ల గత నాలుగు దశాబ్దాల్లో 17,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నక్సల్ నేతలను మట్టుబెట్టామని తెలిపారు.